Wednesday, May 15, 2024

చైనాలో కరోనా కలకలం, భారీగా పెరుగుతున్న కేసులు.. చాంగ్‌చున్‌లో లాక్‌డౌన్‌

చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఈశాన్య చైనీస్‌ నగరంలో శుక్రవారం నుంచి లాక్‌డౌన్‌ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. జిలిన్‌ ప్రావిన్స్‌ రాజధాని.. ముఖ్యమైన పారిశ్రామిక స్థావరం అయిన చాంగ్‌చున్‌లో అందరూ ఇంటి నుంచి పని చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నగరంలో సుమారు 9 మిలియన్‌ల మంది జనాభా నివాసం ఉంటుంది. నిత్యవసరాలు కొనుగోలు చేయడానికి ప్రతీ రెండు రోజులకు ఒక వ్యక్తిని అనుమతించనున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు చైనాలో భారీగా పెరుగుతున్నాయి. అక్కడ కరోనా కేసులు 2020 తరువాత మొదటిసారిగా ఈ వారం 1,000 మార్కును అధిగమించాయి.

షాంఘై స్కూల్స్‌లో కరోనా..

గత వారం రోజులుగా షాంఘైలని పలు పాఠశాలల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉంటూ.. నిబంధనలు పాటించాలని షాంఘై మేయర్‌ గాంగ్‌ జెంగ్‌ గురువారం సోషల్‌ మీడియా ద్వారా కోరారు. గ్వాంగ్‌ డాంగ్‌, జిలిన్‌, షాండాంగ్‌ ప్రావిన్స్‌లలో మెజార్టీ కేసులు నమోదవుతున్నట్టు అధికారులు తెలిపారు. చైనా ప్రత్యేక పరిపాలన ప్రాంతం హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారం రోజుల్లో ఈ ప్రావిన్స్‌లో 1,100 కేసులు నమోదయ్యాయి. చాంగ్‌చున్‌లో శుక్రవారం 2 కేసులు నిర్ధారణ కాగా.. మొత్తం కేసులు 78కు చేరాయి. జిలిన్‌ అగ్రికల్చర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడ్డారు. అక్కడ 74 మందికి వైరస్‌ నిర్ధారణ కావడంతో మిగిలిన 6వేల మందికిపైగా క్వారంటౖన్‌లో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement