Monday, April 29, 2024

రాజ్ నాథ్ సింగ్ కి క‌రోనా.. క్వారంటైన్ లో కేంద్ర‌మంత్రి

క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. కాగా ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. వైద్యుల బృందం రాజ్ నాథ్ సింగ్ ను పరీక్షించిందని, విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వాస్తవానికి ఆయన ఈ రోజు ఢిల్లీలో జరగాల్సిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కు హాజరుకావాల్సి ఉంది. కానీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలతో ఉన్న రాజ్ నాథ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కేంద్ర ఉక్కు, పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సింధియా తనకు కోవిడ్ రిపోర్టు పాజిటివ్ గా వచ్చిందని సోమవారం ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని, కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement