Saturday, April 27, 2024

కరోనా పాజిటివ్.. ఢిల్లీలోని గంగారామ్​ హాస్పిటల్​లో జాయిన్​ అయిన సోనియా గాంధీ..

ఈ మధ్యనే కరోనా బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. జూన్ 2న సోనియాకు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆమె ఇంటికే పరిమితమయ్యారు. అయితే, కరోనా సంబంధిత సమస్యలతో సోనియా ఇవ్వాల హాస్పిటల్​లో చేరినట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, డాక్టర్లు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నందున ఆమె హాస్పిటల్​లోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. సోనియా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ సందేశాలు పంపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement