భారత్ లో కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా ఒక్కరోజే దాదాపు 40 వేల పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 39,726 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు కరోనా కారణంగా 154 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసులు ఒక కోటీ 15 లక్షల 14 వేలకు చేరుకున్నాయి. ఇందులో సుమారుగా ఒక కోటీ 11 లక్షల మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా లక్షా 59 వేల 370 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2 లక్షల 71 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు తెలంగాణలో కూడా కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తోంది.గడిచిన 24 గంటల్లో 62,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 313 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా నిన్న ఇద్దరు మరణించారు. తాజా కేసులతో తెలంగాణవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య సంఖ్య 3,02,360కి చేరుకుంది. ఇక కరోనాతో రాష్ట్రంలో మొత్తం 1664 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 2,98,262 మంది కోలుకోగా ప్రస్తుతం రాష్ట్రంలో 2434 యాక్టివ్ కేసులు ఉన్నాయి.