Saturday, May 4, 2024

పెరుగుతున్న క‌రోనా కేసులు.. మాస్క్ లు ధ‌రించండి.. డాక్టర్ నాయర్

క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి.. కాగా 24గంల వ్య‌వ‌ధిలో 11వేల‌కు పైనే కొత్త కేసులు న‌మోద‌య్యాయి.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,21,725 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 11,109 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇది నిన్నటితోపోలిస్తే 9 శాతం ఎక్కువ. నిన్న ఒక్కరోజే 10,158 కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. మరోవైపు దేశంలో యాక్టివ్‌ కేసుల (Active Cases) సంఖ్య 50 వేలకు చేరువైంది. ప్రస్తుతం 49,622 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,42,16,583 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల (Covid Deaths) సంఖ్య 5,31,064 కి చేరింది.

ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.11 శాతం యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.70 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల ( 220,66,25,120) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడం చాలా ముఖ్యం. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. ఇక ఆసుపత్రులు వంటి ప్రదేశాల్లో డబుల్‌ లేయర్‌ మాస్క్‌లు ధరించడం మంచిది అని ప్రముఖ వైద్యుడు డాక్టర్ నాయర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement