Sunday, April 28, 2024

అగ్నిప‌థ్ కి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ దీక్ష – రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరం

అగ్నిప‌థ్ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా యువ‌కుల ఆందోళ‌న‌కి సంఘీభావంగా స‌త్యాగ్ర‌హ దీక్ష‌ని చేప‌ట్టింది కాంగ్రెస్. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఈ దీక్ష ప్రారంభించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ, ఎంపీలు, కార్యవర్గ సభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ బేరర్లు దీక్షలో కూర్చుకున్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలన్న ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. మరోవైపు జంతర్ మంతర్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రిటీష్ పాలకుల పోలీసులు, లాఠీలు, బ్యారికేడ్లే గాంధీజీ సత్యాగ్రహాన్ని ఆపలేకపోయాయని, ఇప్పుడు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న సత్యాగ్రహాన్ని ఆపగలరా అని ప్రశ్నించింది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఈ రోజు తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement