Tuesday, April 30, 2024

అహంకారం వీగింది.. రైతులు గెలిచారు..వైర‌ల్ గా రాహుల్ గాంధీ ఓల్డ్ ట్వీట్..

రైతులు చేప‌ట్టిన స‌త్యాగ్ర‌హం..కేంద్ర ప్ర‌భుత్వ అహంకారాన్ని త‌ల‌దించేలా చేశార‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. అన్యాయంపై సాధించిన ఈ విజ‌యానికి రైతులంద‌రికీ అభినంద‌న‌లు చెప్పారు..అంతేకాదు . జై హింద్‌, జై హింద్ కిసాన్ అని రాహుల్ ట్వీట్ చేశారు.అయితే ఈ సందర్భంగా ఆయన గతంలో తాను చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో రాహుల్ మాట్లాడుతూ.. ‘నా మాటలు గుర్తుపెట్టుకోండి.. ప్రభుత్వం బలవంతంగానైనా ఈ చట్టాలను రద్దు చేస్తుంద‌ని పేర్కొన్నారు. పాత వీడియోను జత చేయడం ద్వారా.. ఆ రోజు చెప్పిన మాటలు.. ఇప్పుడు నిజమయ్యాయని రాహుల్ తెలియ‌జేశారు. దాంతో రాహుల్ షేర్ చేసిన ఓల్డ్ ట్వీట్ తెగ వైరల్‌గా మారింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో స్పందించింది. అహంకారం వీగింది.. రైతులు గెలిచారు అని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement