Wednesday, May 15, 2024

కాంగ్రెస్ డిజిట‌ల్ స‌భ్య‌త్వ న‌మోదుపై – కాంగ్రెస్ అధ్య‌క్షుల‌తో రేవంత్ రెడ్డి భేటీ

గాంధీ భవన్ లో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదుపై జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షులతో సమావేశమైయ్యారు టిపిసిసి అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్, ఏఐసిసి కార్యదర్శులు శ్రీనివాసన్ కృష్ణన్, బోస్ రాజ్ , టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్స్ లు హాజరైయ్యారు. ఈ సమావేశంలో హన్మకొండ , వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ సభ్యత్వంపై జిల్లా కాంగ్రెస్ అద్యక్షులతో సమీక్షించారు. మండంలో, డివిజన్ లల్లో డిజిటల్ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలనీ సూచించారు. ప్రతి ఒక బూత్ లో 100 కి పైగా సభ్యత్వాలు చేసేలా మండల పార్టీ అద్యక్షులను డివిజన్ అధ్య‌క్షులకు సూచించాలని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement