Thursday, April 25, 2024

ఆ రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్!

దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులు కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు లాక్​డౌన్​ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 24, 25తేదీల్లో సంపూర్ణ లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కూడా జూన్​ 12,13 తేదీల్లో విధించిన లాక్​డౌన్​ మార్గదర్శకాలే వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం మూసివేయనున్నట్లు తెలిపింది. వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న పాజిటివిటీ రేటు ఆధారంగా ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ నెల 23 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల కొవిడ్​ నమూనాలను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని కేరళ సర్కార్ నిర్ణయించింది. కాగా, కేర‌ళ‌లో గడిచిన 24 గంటల్లో అత్య‌ధికంగా 16,848 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

ఇది కూడా చదవండి: ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement