Friday, May 3, 2024

HYD: ఎయిర్‌పోర్ట్ మెట్రో కోసం పెగ్ మార్కింగ్ ప్రారంభం

ఎయిర్‌పోర్ట్ మెట్రో కోసం సర్వే పూర్తయిందని, గ్రౌండ్‌లో దాని అలైన్‌మెంట్ పెగ్ మార్కింగ్ ప్రారంభించబడిందని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎండి NVS రెడ్డి తెలిపారు. రోడ్డుపై సంప్రదాయ ఇంజినీరింగ్ పెగ్ మార్కులే కాకుండా, రాత్రి సమయంలో కనిపించేందుకు రెట్రో రిఫ్లెక్టివ్ షీట్‌తో కూడిన అల్యూమినియం బోర్డులు సెంట్రల్ మీడియన్ లో పెడుతున్నామని, ఇవి చైనేజీని సూచిస్తాయన్నారు. అంటే ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రారంభ స్థానం నుండి ఆ బోర్డు పెట్టిన ప్రదేశం వరకు దూరాన్ని అది సూచిస్తుందని ఎండీ వివరించారు.


ప్రతి 100 మీటర్లకు 0.1 కి.మీ., 0.2 కి.మీ.. ఇలా చిన్న సైజు బోర్డులు వేస్తుండగా, ప్రతి అర కిలోమీటరుకు కాస్త పెద్ద బోర్డులు పెడుతున్నారు. బోర్డులు రాయదుర్గం నుండి బయోడైవర్సిటీ jn వరకు, ఖాజాగూడ రోడ్డులోని IT టవర్స్ నుండి నానక్ రాంగూడ jn వరకు సెంట్రల్ మీడియన్ లో పెడుతున్నారు. నానక్ రాంగూడ jn నుండి TSPA (APPA) jn వరకు సర్వీస్ రోడ్డు విస్తరణలో ఉన్నందున వాటిని ఫుట్‌పాత్ వైపు ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ స్ట్రెచ్‌లో సెంట్రల్ మీడియన్ లేదు. అయితే, ఎయిర్‌పోర్ట్ మెట్రో పిల్లర్లు ORR వెంట నానక్ రాంగూడ jn, TSPA jn మధ్య విస్తరించిన సర్వీస్ రోడ్డు సెంట్రల్ మీడియన్‌లో ఉంటాయని NVS రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement