Tuesday, May 7, 2024

Big Breaking | సీఎం కేసీఆర్​ ఆదేశాలు.. ప్రొఫెసర్​ హరగోపాల్​పై ఉపా కేసు ఎత్తివేత

తెలంగాణ ఉద్యమ నేత, ప్రొఫెసర్​ హరగోపాల్​తో పాటు మరికొంతమందిపై పోలీసులు పెట్టిన దేశ ద్రోహం (యూఏపీఏ), చట్ట విరుద్ధ కార్యకలాపాల యాక్ట్​ 1967 కింద కేసు నమోదైంది. మావోయిస్టులతో లింకులున్నాయనే కారణంగా ప్రొఫెసర్​ హరగోపాల్​తోపాటు మరికొంత మందిపై ఈ కేసును ములుగు జిల్లా పోలీసులు నమోదు చేశారు. అయితే.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సీఎం కేసీఆర్​ పరిశీలించారు. హరగోపాల్​ తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన పాత్ర ఎనలేనిదని సీపీఐ నేత కె. నారాయణ సీఎం కేసీఆర్​కు సూచించారు.

దీంతో ప్రొఫెసర్​ హరగోపాల్​తో పాటు మిగతా వారిపైనా కేసు విత్​ డ్రా చేయాలని సీఎం కేసీఆర్​ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్​కు సూచించారు. దీంతో ఇవ్వాల ములుగు జిల్లా ఎస్పీ ఈ కేసును ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. హరగోపాల్​తోపాటు మరో ఆరుగురిపై కేసు తొలగించారు. ఇందులో హరగోపాల్​, పద్మజాషా, అడ్వొకేట్​ రఘునాథ్​, గడ్డం లక్ష్మణ్​, గుంటి రవీంద్రపై కేసు ఎత్తేసినట్టు ములుగు ఎస్పీ గౌస్​ ఆలం ఇవ్వాల (శనివారం) సాయంత్రం వెల్లడించారు. ఈ విషయమై కోర్టులో మెమో దాఖలు చేయనున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు వీరిపై ఉపా కేసు తొలగిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement