Wednesday, May 1, 2024

Breaking: ఢిల్లీకి చేరిన సీఎం కేసీఆర్‌.. జాతీయ స్థాయిలో ప‌లు కార్య‌క్ర‌మాలు (వీడియో)

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు ఢిల్లీ చేరారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వ‌చ్చారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ నెల 22న ఢిల్లీ నుంచి ఆయన చండీగ‌ఢ్‌ వెళ్తారు. రైతు ఉద్యమంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేస్తారు.

ఈ నెల 26న ఉదయం కేసీఆర్ బెంగళూరుకు వెళ్తారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో భేటీ అవుతారు. మే 27న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధీకి వెళ్లి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేతో సమావేశమవుతారు. అక్కడ నుంచి షిర్డీకి వెళ్లి సాయిబాబాను దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాదుకు తిరిగి వస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement