Tuesday, April 30, 2024

Breaking: యాదాద్రి పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్

యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. బాలాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ఈవో స్వామివారి ప్రసాదంను సీఎం కు అందజేశారు. బాలాలయంలో లక్ష్మీనారసింహుడికి సీఎం కేసీఆర్ పూజలు చేశారు. అర్చకులు సీఎం కెసీఆర్ కు ఆశీర్వచనం అందజేశారు.

అనంతరం.. దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పరిశీలించారు. కళ్యాణ కట్ట, పుష్కరిణీ నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సుదర్శన యాగం తలపెట్టిన యాగ స్థలాన్ని 75 ఎకరాల సువిశాల ప్రాంగణం లో నిర్వహించనున్న యాగశాల ఏర్పాట్లను పరిశీలించారు. అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణాలను పరిశీలించారు. పుష్కరిణీలో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత… స్నానం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలనూ సీఎం పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే గొంగిడి సునీత, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement