Tuesday, May 14, 2024

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ నేడు యాదాద్రిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకోనున్నారు. యాదాద్రి ఆల‌య పున‌ర్నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలించనున్నారు. మార్చి 28న మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ దృష్ట్యా జ‌రుగుతున్న‌ ప‌నులను కేసీఆర్ ప‌రిశీలించ‌నున్నారు. ఆ త‌ర్వాత‌ సుద‌ర్శ‌న యాగం, ఇత‌ర ఏర్పాట్ల‌పై సీఎం స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. సుదర్శన యాగంలో 1108 యజ్ఞ గుండాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గుండానికి ఆరుగురు చొప్పున మొత్తం 6వేలకు పైగా రుత్విక్కులు ఈ యాగంలో పాలుపంచుకుంటారు. ఆలయ పునఃప్రారంభం సందర్భంగా వేడుకలకు వచ్చే ప్రముఖులు, అతిథులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, పెద్ద ఎత్తున తరలివచ్చే లక్షలాది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపైనా సీఎం కేసీఆర్ సమీక్షిస్తారు. అలాగే, యాగశాల నిర్మాణ పనులు కూడా కేసీఆర్ పరిశీలిస్తారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement