Sunday, April 28, 2024

తమిళనాడుకు తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు తమిళనాడు పర్యటనకు వెళ్తున్నారు. కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుచ్చి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం చెన్నై చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

మరోవైపు రేపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అవుతారని సమాచారం. యాసంగి పంట విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం ఉన్న కేసీఆర్.. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన స్టాలిన్‌తో సమావేశం అవుతున్నట్టు సమాచారం.

కాగా, యాసంగిలో దొడ్డు బియ్యం సేకరణ విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదే విషయమై టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో నిరసనలు కూడా తెలిపి సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement