Tuesday, May 7, 2024

CM KCR: తెలంగాణవ్యాప్తంగా బస్తీ దవాఖానాల ఏర్పాటు

బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను.. రాష్ట్రంలో ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని సీఎం కేసిఆర్ నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… హెచ్ఎండిఎ పరిధిలోని కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు మెరుగుపరిచేందుకు వార్డుకొకటి చొప్పున 6 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రసూల్ పుర -2, ఎల్.బి.నగర్, శేర్ లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, జల్ పల్లి, మీర్ పేట, పిర్జాదీగూడ, బోడుప్పల్, జవహర్ నగర్, నిజాంపేట్ ఒక్కోటి చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని  వైద్యాధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

ఇక, హైదరాబాద్ బస్తీ దవాఖానాల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 4 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా నిజామాబాద్ లో 3,  మహబూబ్ నగర్, నల్గొండ, మిర్యాలగూడ, రామగుండం, ఖమ్మం , కరీంనగర్ లో రెండు చొప్పున ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే, జగిత్యాల, సూర్యాపేట, సిద్ధిపేట, కొత్తగూడెం, పాల్వంచ, నిర్మల్, మంచిర్యాల, తాండూర్, వికారాబాద్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, సంగారెడ్డి, జహీరాబాద్, గద్వాల్, వనపర్తి, సిరిసిల్ల, తెల్లాపూర్, బొల్లారం, అమీన్ పూర్, గజ్వేల్, మెదక్ లో ఒక్కోటి చొప్పున బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement