Wednesday, May 8, 2024

కరోనా వస్తే డోలో మందు బిళ్ల చాలు: సీఎం కేసీఆర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి కరోనా వైద్యంపై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కరోనా వస్తే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. కరోనాకు మందు లేదని..కరోనా వచ్చిన సమయంలో తాను కూడ డోలో తో పాటు మరో మందు.. బిళ్ల వేసుకొన్నానని సీఎం వివరించారు.

వరంగల్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈ విధంగా కామెంట్స్ చేశారు. కరోనా వస్తే టెంపరేచర్ పెరుగుతోందన్నారు. జ్వరం వచ్చిన సమయంలో డాక్టర్ సలహా మేరకు డోలో టాబ్లెట్ తో పాట యాంటీ బయాటిక్ మందులను ఉపయోగించుకొంటే కరోనా  తగ్గిపోతోందన్నారు. తాను కూడ ఈ రెండు రకాలైన మందులను మాత్రమే వాడానని ఆయన చెప్పారు. తనకు డీ విటమిన్ టాబ్లెట్ ఇస్తే ఉపయోగించలేదన్నారు. వారం రోజుల్లోనే  తాను కరోనా నుండి కోలుకొన్నానని సీఎం చెప్పారు.

ఇప్పుడు సీఎం కామెంట్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. కరోనా వస్తే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అయితే అవే కాంమెట్స్ ని ఇప్పుడు కేసీఆర్ చేయడంతో మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement