Thursday, May 2, 2024

మ‌న ప‌ల్లెలు దేశానికి ప‌ట్టుగొమ్మ‌లు – మంత్రి ఎర్ర‌బెల్లి

మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూర్ మండ‌లం వెంక‌టాపురం గ్రామ పంచాయ‌తీ, గ్రామ స్ప‌రంచ్ ను పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఘ‌నంగా స‌న్మానించారు. జాతీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వ శక్తి కరణ్ పురస్కారానికి ఇటీవల ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంద‌న్నారు.. పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, అందువల్లే మన పల్లెలు దేశానికి పట్టుగొమ్మలుగా మారాయని చెప్పారు. ఈ మధ్య ప్రకటించిన జాతీయ ఉత్తమ జిల్లా, మండల, గ్రామ స్థాయిలో 19 అవార్డులు దక్కాయి. అవన్నీ మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా మారాయి అనడానికి నిదర్శనం అన్నారు. సీఎం లక్ష్యాన్ని నెరవేర్చేందుకు మంత్రిగా తాను, అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామ‌న్నారు.ప్రజల భాగస్వామ్యంతోనే ఇదంతా సాధ్యమైందని మంత్రి చెప్పారు. కరోనా కాలంలో సర్పంచ్ సేవను గుర్తు చేశారు. కరోనాతో మరణించిన వ్యక్తిని స్వయం గా ట్రాక్టర్ పై తీసుకెళ్లి అంతక్రియలు చేశారు అని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement