Friday, April 26, 2024

పేద బీటెక్ విద్యార్థికి ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా చేయూత

హైదరాబాద్ లోని ప్రగతినగర్ మేడిపల్లిలో పేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన (తుమ్మలపల్లి ఆదిలక్ష్మి మనవడు) తుమ్మలపల్లి రూపేష్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పేద విద్యార్థి ఎడ్యుకేషన్ ఫీజు కోసం వారి ఆర్థిక ఇబ్బందులు పరిస్థితి తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ ఛైర్మ‌న్, ఐవీఎఫ్ తెలంగాణ అధ్య‌క్షుడు ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా చేయూత‌నందించాడు. హైదరాబాద్ లోని ఉప్పల శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయంలో వచ్చి కలిసిన సందర్భంగా వారికి బీటెక్ ఫైనల్ ఇయర్ ఫీజు కోసం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్-తెలంగాణ ఆధ్వర్యంలో.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా రూ.20వేల‌ చెక్కును ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. ఆవోపా హైదరాబాద్ ప్రెసిడెండ్ నమశివాయ, తుమ్మల పల్లి ఆదిలక్ష్మి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement