Wednesday, April 24, 2024

ప్రజలందరూ చల్లగా ఉండాలని మొక్కుకున్నా – సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల

తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ చల్లగా ఉండాలని అయ్యప్పస్వామిని మొక్కు కున్నట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆయ‌న శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. మంత్రి వెంట కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , మాజీ స్పీకర్ మధుసూదన్ చారి , మేడారం సింగిల్విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి , జెడ్పిటిసి బాదినేని రాజేధర్ , మాజీ మార్కెట్ ఛైర్మన్ ఏలేటి క్రిష్ణారెడ్డి తో పాటు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement