Saturday, April 27, 2024

KCR: ద‌మ్ముంటే నన్ను జైలుకు పంపండి: బీజేపీకి సీఎం కేసీఆర్ స‌వాల్

ద‌మ్ముంటే త‌న‌ను జైలుకు పంపాల‌ని బీజేపీ నేత‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్ స‌వాల్ విసిరారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్ష‌లో సీఎం కేసీఆర్ బీజేపీపై మండిపడ్డారు. కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థ‌ల‌తో దాడులు చేస్తారని అన్నారు. బీజేపీలో అంద‌రూ స‌త్య‌హ‌రిశ్చంద్రులే ఉన్నారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. వాళ్ల ద‌గ్గ‌ర‌కు ఈడీ, సీబీఐ వెళ్ల‌దన్నారు. ప్ర‌తి రాష్ట్రంలో ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. త‌న‌ను జైలుకు పంపుతామ‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు అంటున్నారని, ద‌మ్ముంటే తనను జైలుకు పంపండని కేసీఆర్‌ స‌వాల్ విసిరారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల‌ని తాము ఢిల్లీలో ధ‌ర్నా చేస్తే.. పోటీగా బీజేపీ నేత‌లు హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చేస్తున్నారు. అస‌లు వాళ్ల‌కు సిగ్గుండాల‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. ఏ ఉద్దేశంతో బీజేపీ నేతలు హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చేస్తున్నార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement