Tuesday, April 30, 2024

చంద్ర‌బాబునాయుడు కోలుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ ట్వీట్ – విజ‌య‌సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు

ప్ర‌తిప‌క్ష నేత,టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. కాగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చంద్ర‌బాబు క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ట్వీట్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఆరోగ్యం కుదుట ప‌డాల‌ని కోరారు. దాంతో సీఎం జ‌గ‌న్ చేసిన ఈ ట్వీట్ వైర‌ల్ గా మారింది. చంద్ర‌బాబు, జ‌గ‌న్ ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ చేసిన ట్వీట్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ట్వీట్ పై విజ‌య‌సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు స్పందించారు. యాదృచ్ఛికమే అయినా ఎన్టీఆర్ వర్ధంతి నాడే చంద్రబాబుకు కరోనా సోకడం బాధాకరమని ట్వీట్ చేశారు. బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుందిలేగానీ.. టీడీపీ వ్యవస్థాపకుడికి ఆయన పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకూ గుర్తుండిపోతుందని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement