Tuesday, May 7, 2024

తాతని బండరాయితో కొట్టి చంపిన మనవడు

ఓ మ‌న‌వ‌డు మతిస్థిమితం లేక తాతను బండరాయితో కొట్టి చంపిన ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కల్వకోట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… ఆది మల్లయ్య (80) అనే వృద్దున్ని తన మనవడు చందు(25) బండ రాయితో కొట్టి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ పంచాయితీ వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయిన సంఘటన దృశ్యాలు, తాతని బండతో కొట్టిన అనంతరం యువకుడు అదే బైక్ పై ముందర వేసుకొని ఇంటికి తీసుకెళ్లాడు.

గ్రామస్తులు చూస్తుండగానే ఘటన జరగడంతో అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపైన కూడా దాడికి ప్రయత్నించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలాన్ని మేడిపెల్లి ఎస్ఐ సుధీర్ రావు పరిశీలించారు. గత కొన్ని రోజులుగా చందుకు మతిస్థిమితం సరిగ్గా ఉండట్లేదని గ్రామస్తులు తెలిపారు. చందు తండ్రి మృతిచెందగా తల్లి, ఒక సోదరుడు ఉన్నారు. నిందితుడిపై గతంలోనే దాడి కేసు ఉన్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మల్లయ్య మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement