Friday, May 3, 2024

సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె నాయుడికి ఊర‌ట – బెయిల్ ఇచ్చిన కోర్టు

టాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె నాయుడుకి తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. సినీ న‌టి భీమిరెడ్డి శ్రీసుధ‌తో స‌హ‌జీవ‌నం చేశాడు శ్యామ్ కె నాయుడు. దాంతో ఆయ‌న వార్త‌ల్లో నిలిచారు. తనతో శ్యామ్ కె నాయుడు పెళ్లి పేరిట -..ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని శ్రీసుధ అప్పట్లో హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరగా, శ్యామ్ కె నాయుడుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే తెలంగాణ హైకోర్టు తీర్పును శ్రీసుధ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్యామ్ కె నాయుడు ద్వారా తనకు ప్రాణహాని ఉందని, అతడి బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు… శ్రీసుధ పిటిషన్ ను కొట్టివేసింది. బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement