Sunday, May 5, 2024

Big Breaking | యూపీ, బిహార్​ నుంచి చైల్డ్​ ట్రాఫికింగ్​.. 18మంది పిల్లలు సేఫ్​

ఉత్తరప్రదేశ్, బిహార్​ రాష్ట్రాల నుంచి చిన్నారులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాని ఇవ్వాల (శుక్రవారం) పోలీసులు పట్టుకున్నారు. వరంగల్​ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్​లో జరిపిన దాడుల్లో 18 మంది చిన్నారుల లైఫ్​ని సేవ్​ చేశారు. వారిని సంరక్షణా కేంద్రానికి తరలించారు.

యూపీ, బిహార్​ నుంచి చిన్నారులను ఇతర రాష్ట్రాలను తరలిస్తున్న 12 మంది గ్యాంగ్ మెంబర్స్​ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్​ (రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్​) పోలీసులు, యాంటీ హ్యూమన్​ ట్రాఫికింగ్​ టీమ్​ చేపట్టిన తనిఖీల్లో యూపీ, బిహార్​ నుంచి బాలురు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement