ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి చిన్నారులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాని ఇవ్వాల (శుక్రవారం) పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్లో జరిపిన దాడుల్లో 18 మంది చిన్నారుల లైఫ్ని సేవ్ చేశారు. వారిని సంరక్షణా కేంద్రానికి తరలించారు.
యూపీ, బిహార్ నుంచి చిన్నారులను ఇతర రాష్ట్రాలను తరలిస్తున్న 12 మంది గ్యాంగ్ మెంబర్స్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ చేపట్టిన తనిఖీల్లో యూపీ, బిహార్ నుంచి బాలురు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తేలింది.