Friday, April 26, 2024

IPL 2021: బెంగళూరుపై చెన్నై గెలుపు

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మరో సూపర్ విక్టరీ నమోదు చేసింది. శుక్రవారం షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్.. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ  హాఫ్ సెంచరీలు బాదడంతో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ తో పాటు అంబటి రాయుడు  దూకుడుగా ఆడడంతో చెన్నై జట్టు 18.1 ఓవర్లలోనే 157/4తో గెలుపొందింది. మొత్తంగా సీజన్‌లో 9వ మ్యాచ్ ఆడిన చెన్నై టీమ్ ఏడో గెలుపుతో మళ్లీ పాయింట్ల పట్టికలో నెం.1 స్థానానికి ఎగబాకింది. బెంగళూరు నాలుగో ఓటమితో మూడో స్థానంలో ఉంది.

ఇది కూడా చదవండిః గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం త్వరలో కొత్త పథకం

Advertisement

తాజా వార్తలు

Advertisement