Saturday, May 4, 2024

చెక్ బౌన్స్ కేసులో కోర్టుకి హాజ‌ర‌యిన హీరో సుమంత్, ఆయ‌న సోద‌రి సుప్రియ‌

నరుడా డో నరుడా చిత్రానికి నిర్మాతగా సుమంత్ సోదరి సుప్రియ వ్యవహరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే… మాచర్ల కు చెందిన కారుమంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి నుండి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు సుప్రియ..నగదు కు ష్యురిటీ గా సుమంత్, సు ప్రియల జాయింట్ అకౌంట్ చెక్కు ను అందజేశారు. అయితే… సమయానికి నగదు ఇవ్వక పోవడంతో చెక్కును బ్యాంకులో వేశారు కారుమంచి శ్రీనివాసరావు. ఆ అకౌంట్ లో నగదు లేక పోవ‌డంతో… చెక్ బౌన్స్ అయింది. దీంతో మార్కాపురం కోర్టులో… వారిపై కేసు వేశారు శ్రీనివాసరావు. ఈ కేసులో భాగం గానే… విచారణ నిమిత్తం కోర్టులో హాజరయ్యారు హీరో సుమంత్, నిర్మాత సుప్రియలు. కాగా వీరిద్ద‌రూ కోర్టు వెళ్లిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement