Sunday, April 28, 2024

ప‌ది మంది పిల్ల‌ల్ని కంటే న‌గ‌దు ప్రోత్సాహం- ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్

ప‌ది అంత‌కంటే ఎక్కువ‌మంది పిల్ల‌ల‌ను క‌లిగిన మ‌హిళ‌ల‌ల‌కు న‌గ‌దు ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌క‌టించారు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్.
కరోనా మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం ఆ దేశ జనాభా ఉత్పత్తిపై పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రోత్సహించాలని పుతిన్ నిర్ణయించారు. పది మంది పిల్లలను కనే మహిళకు ఒక మిలియన్ రూబుల్స్ ( 13,500 పౌండ్లు)ను ఇవ్వడం ఇందులో ఒకటి. పదో సంతానం మొదటి పుట్టిన రోజున ఈ మొత్తాన్ని ఇస్తారు. కాకపోతే అప్పటికి మిగిలిన తొమ్మిది మంది పిల్లలు కూడా జీవించి ఉండాలి. పుతిన్ విధానాన్ని నిపుణులు విమర్శిస్తున్నారు. ఎక్కువ మందిని కనే వారినే దేశభక్తులుగా పేర్కొంటున్నట్టు ఉందని అభిప్రాయపడుతున్నారు. విస్తీర్ణం పరంగా అతిపెద్ద దేశమైన రష్యా జనాభా కేవలం 14 కోట్లే.

Advertisement

తాజా వార్తలు

Advertisement