Sunday, April 28, 2024

చ‌ర్చిలో తొక్కిస‌లాట – 29మంది మృతి

చ‌ర్చిలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిస‌లాట‌లో 29మంది మృతి చెందారు. లైబీరియా రాజ‌ధాని మొనోర్వియాలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద రాత్రి వేడుక సందర్భంగా దోపిడీ ముఠా మారణాయుధాలతో ప్రవేశించినట్టు ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు కింద పడిపోగా, మిగిలిన వారు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. ఈ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement