Monday, April 29, 2024

వైఎస్ వివేకా హత్య కేసుపై – టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

కడప జిల్లా , పులివెందుల – దస్తగిరి వాంగ్మూలం మేరకు దేవిరెడ్డి శంకర్‍రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. ఎంపీ వైఎస్ అవినాష్‍రెడ్డి, తండ్రి భాస్కర్‍రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎందుకు వారిపై చార్జ్ షీట్ దాఖలు చేయడం లేదని నిల‌దీశారు. రెండో చార్జ్ షీట్‍లో ఐదో నిందితుడిగా దేవిరెడ్డి శంకర్‍రెడ్డిని చేర్చారు.. దేవిరెడ్డి శంకర్‍రెడ్డిని అరెస్ట్ చేసి 80 రోజులైనా ఎందుకు అవినాష్‍రెడ్డి, భాస్కర్‍రెడ్డిని అరెస్ట్ చేయరని ప్ర‌శ్నించారు. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్ళి వ‌చ్చాక కేసు విచారణ నెమ్మదిగా సాగుతోంద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement