Tuesday, April 30, 2024

దేశ రాజ‌కీయాల్లో బీఆర్ ఎస్ స‌క్సెస్ సాధిస్తుంది.. తమ స‌పోర్ట్ ఉంటుందన్న ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ

సీఎం కేసీఆర్ నాయక‌త్వం ఇప్పుడు దేశానికి ఎంతో అవ‌స‌ర‌మ‌ని, ఇట్లాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆయ‌న‌ ముందుకు రావడం సంతోషంగా ఉంద‌న్నారు ఇండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ నేత బండ సురేంద‌ర్‌రెడ్డి. కేసీఆర్ నాయకత్వంలోని “బారత్‌ రాష్ట్ర సమితి’’ జాతీయ రాజకీయాల్లో సమర్ధవంతమైన పాత్ర పోషిస్తుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. ఎనిమిది సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని.. వారికి నచ్చని ప్రభుత్వాలను కూలదోస్తూ, బ్లాక్ మేయిలింగ్ కు పాల్పడుతోందన్నారు.

సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటూ వాటిని దుర్వినియోగం చేస్తోందన్నారు ఫార్వర్డ్​ పార్టీ నేత సురేంద‌ర్‌రెడ్డి.. ఇట్లాంటి ఉన్మాద చర్యలతో దేశంలో అశాంతి, అసహనం, ఆందోళనలు పెరిగాయని, ప్రజల్లో ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ తమ రాజకీయ కలాపాలు సాగిస్తున్నారని విమర్శించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రంలోని మోడీ, అమిత్ షా కుటిల రాజనీతికి వెరవకుండా రాబోయే ఏలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్దపడి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం అత్యంత సాహసోపేతమైన నిర్ణయంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తోందన్నారు.

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్​ స్థాపించిన భారత్‌ రాష్ట్ర సమితికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నామన్నారు బండ సురేంద‌ర్‌రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఐ ఎస్ బి తరపున రామగుండం నుండి గెలుపొందిన కోరుకంటి చందర్ టి ఆర్ ఎస్ లో చేరి ప్రస్తుతం పెద్దపల్లి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంతో ఇంతో ఓటు బ్యాంకు కలిగి ఉన్న సింహం గుర్తు పార్టీ ఇక్కడ బి ఆర్ ఎస్ కు అండగా నిలబడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement