Wednesday, April 17, 2024

Breaking: కేసీఆర్ నల్లపిల్లితో క్షుద్రపూజలు చేస్తాడన్న బండి సంజయ్.. ఎర్రగడ్డలో బెడ్ ఖాళీగా ఉందన్న కేటీఆర్

సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో తాంత్రిక పూజలు చేస్తార‌ని, టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ మార్చడం వెనుక ఓ తాంత్రికుడి సలహా ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోప‌ణ‌లు చేశారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో ప్రతి మూడు నెలలకోసారి నల్లపిల్లితో పూజలు చేస్తార‌ని, గతంలో ఓ యువకుడి అనుమానాస్పద స్థితిలో ఫాంహౌస్‌లో మృతి చెందితే, ఆ కేసు ఏమైందో కూడా తెలియదని కామెంట్స్ చేశారు. ఎన్ని క్షుద్రపూజలు చేసినా పరిస్థితి మారకపోవడంతో తాంత్రికుడి సూచన మేరకే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చార‌ని బండి సంజయ్ పేర్కొన్నారు.

అయితే.. బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ సీరియ‌స్‌గానే రియాక్ట్ అయ్యారు. ‘‘ఈ లవంగం గారిని ఇలాగే వదిలేయకండిరా బీజేపీ బాబులూ’’ అంటూ వ్యాఖ్యానించారు. పిచ్చి ముదిరి త్వరలో కరవడం మొదలుపెడతాడేమో అంటూ వ్యంగ్యంగా ప్రదర్శించారు. మతిలేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడని కేటీఆర్ విమర్శించారు. ఎర్రగడ్డలో బెడ్ ఖాళీగానే ఉంది.. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి అంటూ సెటైర్ వేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా కేటీఆర్ షేర్​ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement