Tuesday, April 30, 2024

విరిగిన స్టీరింగ్.. అదుపుత‌ప్పి పంట‌పొలాల్లోకి దూసుకెళ్లిన బ‌స్సు

ఓ బ‌స్సు అదుపుత‌ప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే బస్సు డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ప్ర‌యాణికుల‌కు ఎటువంటి గాయాలు కాలేదు. దాంతో ప్ర‌యాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ సంఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని రాయిచూర్ ఐజ మండలం మిట్ట‌దొడ్డి స్టేజ్ వ‌ద్ద చోటు చేసుకుంది. ఈ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఆర్టీసీ బ‌స్సు స్టీరింగ్ విరిగిపోయింది. దీంతో బ‌స్సు అదుపుత‌ప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement