Saturday, May 18, 2024

Breaking : చిరంజీవి, నేను గూడుపుఠాణి చేయ‌డం లేదు – నంది అవార్డులు ఇవ్వాల‌ని కోరుతున్నా- నిర్మాత త‌మ్మ‌రెడ్డి

గ‌తంలో సీఎం జ‌గ‌న్ ని , న‌టుడు మెగాస్టార్ చిరంజీవి క‌లిశారని..మ‌రోసారి చిరంజీవి చ‌ర్చ‌ల‌కి వెళ్తార‌ని తెలుస్తోంద‌ని టాలీవుడ్ నిర్మాత త‌మ్మ‌రెడ్డి భ‌ర‌ద్వాజ్ అన్నారు. నేను, చిరంజీవి క‌లిసి గూడుపుఠాణి చేయ‌డం లేద‌న్నారు. ఆన్ లైన్ టికెటింగ్ ప్ర‌జ‌ల‌కు బాగా అల‌వాటైందని అన్నారు. టికెట్ రేట్ల అంశం చాలా చిన్న విష‌యం అన్నారు త‌మ్మారెడ్డి. రేట్లు పెంచితే డ‌బ్బులొస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మేన‌ని చెప్పారు. చిన్న సినిమాల‌కు స‌బ్సిడీలు ఇవ్వాల‌ని తెలిపారు. నంది అవార్డులు ఇవ్వాల‌ని రెండు ప్ర‌భుత్వాల‌ను కోరుతున్నాన‌ని అన్నారు. మినీ థియేట‌ర్ల‌ను ప్రోత్స‌హిస్తే చాలా మంచిద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement