Monday, April 29, 2024

Breaking : విమానంలో క్షీణించిన ప్రయాణీకుడి ఆరోగ్యం -వైద్యం అందించిన కేంద్ర మంత్రి..ఎంపీ

ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఔరంగాబాద్‌కు వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రయాణీకుడు అకస్మాత్తుగా అపస్మారక స్థితి .. అసౌకర్యం గురించి తెలిపాడు. విమానంలో ఉన్న బిజెపికి చెందిన కేంద్ర రాష్ట్ర మంత్రి .. ఎంపీ ప్రయాణికుడికి సహాయం చేశారు. వైద్య సహాయం పొందిన తర్వాత ప్రయాణీకుడు మెరుగైన అనుభూతి చెందాడు. సాయం చేసిన రాజకీయ నాయకులిద్దరూ వృత్తిరీత్యా వైద్యులేనని, కష్టకాలంలో ఇద్దరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని చెబుతున్నారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. దీంతో పాటు రాజకీయ నాయకుల ఫొటోలను కూడా ట్వీట్ల ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్ …డాక్టర్ సుభాష్ భామ్రే ప్రయాణికుడి దగ్గర నిలబడి అతనికి చికిత్స చేస్తున్న‌ట్టు ఫొటో వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement