Wednesday, May 1, 2024

Breaking : ముచ్చింత‌ల్ లో ప్ర‌ధాని – ప‌ట్టు వ‌స్త్రాలు, తిరునామాలు ధ‌రించి మోడీ ప్ర‌త్యేక పూజ‌లు

ముచ్చింత‌ల్ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఈ సంద‌ర్భంగా యాగ‌శాల‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. విశ్వ‌క్సేనుడి ఆరాధ‌న‌లో పాల్గొన్నారు మోడీ. తిరునామాలు , ప‌ట్టు వ‌స్త్రాలు ధ‌రించి యాగ‌శాల‌కు విచ్చేశారు ప్ర‌ధాని. 7గంట‌ల‌కు స‌మతామూర్తి విగ్ర‌హాన్ని జాతికి అంకితం ఇవ్వ‌నున్నారు. 15నిమిషాలు 3డీ షోని వీక్షించ‌నున్నారు ప్ర‌ధాని. స‌మ‌తామూర్తి స‌హ‌స్రాబ్ది స‌మారోహాన్ని వైభ‌వంగా నిర్వ‌హించారు. యాగశాల‌, భ‌ద్ర‌పీఠం,స‌భామంట‌పాన్ని సుగంధ భ‌రిత పుష్పాల‌తో అలంక‌రించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement