Thursday, May 9, 2024

Breaking : రైలులో మంట‌లు.. ఒక కోచ్ ద‌గ్థం.. త‌ప్పిన ప్రాణ‌న‌ష్టం

అల‌ప్పుజా..క‌న్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ ప్రెస్ లో నేటి తెల్ల‌వారు జామున కన్నూర్ రైల్వే స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. రైల్వే స్టేషన్‌లో రైలు ఆగి ఉండగా ఈ ఘటన జరిగింది. మంటల్లో రైలులోని ఒక కోచ్ దగ్ధమైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక కోచ్‌లో మంటలు చెలరేగడంతో రైలులోని ఇతర కోచ్‌లను దాని నుంచి విడదీశారు.
తెల్లవారుజామున 1.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తి కోచ్ వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. అయితే గుర్తుతెలియని పెట్రోల్ లాంటి ఇంధనం పోసి నిప్పంటించినట్లుగా అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement