Tuesday, April 30, 2024

Breaking : దిశ నిందితుల ఎన్ కౌంట‌ర్ పై సిర్పుర్క‌ర్ క‌మిష‌న్ విచార‌ణ ..

దిశ నిందితుల ఎన్ కౌంట‌ర్ పై సిర్పుర్క‌ర్ క‌మిష‌న్ విచార‌ణ చేప‌ట్టింది. ఎన్ కౌంట‌ర్ జ‌రిగిన ప్ర‌దేశాన్ని క‌మిష‌న్ ప‌రిశీలించింది. ఈ మేర‌కు దిశ మృత‌దేహాన్ని ద‌హ‌నం చేసిన స్థ‌లాన్ని క‌మిష‌న్ ప‌రిశీలించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్ కేసు విచారణ వేగవంతం అయింది. గత కొద్ది రోజులుగా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి విచారణ జరుపుతున్న సిర్పుర్కర్ కమిషన్ నేడు నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంతో పాటు దిశ అత్యాచారం, హత్య చేసిన ప్రాంతాలను కూడా పరీశీలించి విచారణ చేపట్టనున్నారు. కాగా విచారణలో భాగంగా ఇప్పటికే ఆ సంఘటనలో పాల్గొన్నా అప్పటి సీపీ సజ్జనార్, డిసిపి ప్రకాష్ రెడ్డితో పాటు అప్పటి షాద్ నగర్ ఏసీపీ సురేందర్, సిఐ శ్రీధర్ కుమార్ తదితర పలువురు పోలీస్ ఉన్నతాధికారులను విచారించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement