Tuesday, April 30, 2024

Breaking : న‌కిలీ ఇళ్ల ప‌ట్టాలు త‌యారీ వ్య‌వ‌హారంపై – ముగ్గురి ఇళ్ల‌పై దాడులు

కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రాత్రి 11 గంటల నుంచి నకిలీ ఇళ్ల పట్టాలు తయారీ వ్యవహారంపై మెరుపు దాడులకు శ్రీకారం చుట్టారు బద్వేలు ఆర్డిఓ ఆకుల వెంకటరమణ..ముగ్గురు ఇళ్లపై సోదాలు నిర్వహించి నకిలీ ఇళ్ల పట్టాల తయారీకి ఉపయోగించే సీలు.. కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ పోలీసు అధికారులు. బత్తిన రవిశంకర్ సుమిత్రా నగర్ కి చెందిన వ్యక్తి ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. బద్వేలు లో ప్రకంపనలు సృష్టిస్తోన్న నకిలీ ఇళ్ల పట్టాలు వ్యవహారంపై లోతుగా అధ్యయనం చేపట్టారు ఆర్డీవో వెంకటరమణ. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారానికి సంబంధించి దాడులలో పాల్గొన్నారు బద్వేల్ గోపవరం రెవెన్యూ పోలీసు అధికారులు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీ లో ఎవరెవరు పాత్ర ఉంది నిగ్గు తేల్చి కేసులు పెట్టనున్నారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement