Thursday, May 2, 2024

Breaking : జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై సీఎం జ‌గ‌న్ సమీక్ష – ఒకే స‌ముదాయంలో అధికారుల కార్యాల‌యాలు

ఏపీలో జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై సీఎం జ‌గ‌న్ సమీక్ష నిర్వ‌హించారు..క‌లెక్ట‌ర్ తో పాటు జిల్లా పోలీసు అధికారి కార్యాల‌యాల‌న్నీ ఒకే స‌ముదాయంలో ఉండేలా చూసుకోవాల‌ని జ‌గ‌న్ తెలిపారు. ప‌దికాలాలు గుర్తుండేలా భ‌వ‌నాల నిర్మాణం ఉండాల‌న్నారు. ప్ర‌స్తుతం అద్దె భ‌వ‌నాలు తీసుకున్న జిల్లాల్లో కొత్త భ‌వ‌నాల నిర్మాణాల‌కు ప్రాధాన్య‌త‌నివ్వాల‌న్నారు. సుస్థిర ఆర్థిక ప్ర‌గ‌తి కోసం నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను ..కొత్త జిల్లాల‌తో అనుసంధానం చేయాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. భ‌వ‌న నిర్మాణాల కోసం అనువైన స్థ‌లాల ఎంపిక‌ను పూర్తి చేయాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. క‌నీసం 15ఎక‌రాల స్థలం ఉండేలా చూసుకోవాల‌ని జ‌గ‌న్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement