Thursday, May 16, 2024

Breaking : అధిక వ‌డ్డీల‌కు – మ‌రొక‌రు బ‌లి

కృష్ణాజిల్లా : పెడన మండలంలో అధిక వడ్డీలకు మరొకరు బలి అయ్యారు. చెన్నూరు ఎంపిటిసి కాటం నాగమణి భర్త మృతి చెందారు. ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా ఎంపీటీసీ భర్త కొండ పురుగుమందు తాగి మృతి చెందారు. దాంతో కుటుంబ స‌భ్యులు ఆందోళన చేశారు.ఈ నేపథ్యంలో పెడన ఎస్సై నాగ కళ్యాణి రంగప్రవేశం చేశారు.. కొండ మృతికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభమ‌యింది. మృతదేహాన్ని బందరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఆర్థిక ఒత్తిళ్లకు గురి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని గ్రామాల్లో దళితుల ఆందోళన చేశారు. ఎస్సై నాగ కళ్యాణి హామీతో గ్రామస్తులు శాంత‌ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement