Sunday, May 19, 2024

Breaking : మంచులో చిక్కుకున్న ఆరుగురు వ్య‌క్తులు – సెర్చ్ ఆప‌రేషన్ ప్రారంభించిన సైన్యం

జ‌మ్మూ కాశ్మీర్ లో భారీగా మంచు కురుస్తోంది. కాగా ఆరుగురు వ్య‌క్తులు మంచులో చిక్కుకున్నారు. దాంతో సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. కిష్త్వార్ పరిధిలోని వార్వాన్ గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా నుంచి మార్గన్ టాప్ మీదుగా కాలినడకన వెళ్లారని, మార్గన్ టాప్ నుంచి 20 గంటల కంటే ముందే ఫోన్ చేశారని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ అమీర్ అలీ తెలిపారు. అప్పటి నుంచి వీరికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని, అయితే వారి గురించి ఇంకా ఏమీ తెలియలేదని, వారు మంచులో చిక్కుకున్నారని అలీ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement