Wednesday, May 1, 2024

Breaking: సీఎం స‌భ‌లో బాంబుదాడి.. క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డ నితీశ్‌ కుమార్​

బిహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ పాల్గొన్న స‌భ‌లో ఇవ్వాల బాంబు దాడి జ‌రిగింది. అయితే సీఎం నితీశ్ క్షేమంగానే ఉన్నార‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. న‌లందాలోని సిలావ్ అనే పాఠ‌శాల‌లో జ‌రిగిన ఓ స‌భ‌లో నితీశ్ పాల్గొన్నారు. ఈ స‌మ‌యంలోనే బాంబు దాడి జ‌రిగిందని, సీఎం ఉన్న ప్రాంతానికి కేవ‌లం 18 ఫీట్ల దూరంలోనే ఈ దాడి జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. మ‌రో వైపు పోలీసులు ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది బాంబు దాడి కాద‌ని.. కొంద‌రు వ్య‌క్తులు ప‌టాకులు పేల్చార‌న్న‌ది మ‌రో వాద‌న‌.

ఇస్లాంపూర్ స‌త్యర్ గంజ్‌కు చెందిన ఓ వ్య‌క్తి ప‌టాకులు కాల్చ‌డంతో ఇలా పెద్ద ఎత్తున సౌండ్ వ‌చ్చింద‌ని వారి వాద‌న‌. ఏది ఏమైనా సీఎం నితీశ్ పాల్గొన్న స‌భ‌లో, అది కూడా ఆయ‌న‌కు అత్యంత స‌మీపంలో ఈ ఘ‌ట‌న జ‌రగ‌డాన్ని పోలీసులు చాలా సీరియ‌స్‌గా తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ యువ‌కుడు సీఎం నితీశ్‌పై దాడి చేశాడు. భ‌క్తియార్ పూర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నితీశ్ ఓ విగ్ర‌హానికి పూల మాల వేస్తుండ‌గా, సెక్యూరిటీని త‌ప్పించుకొని వ‌చ్చిన యువ‌కుడు వెన‌కనుంచి దాడి చేశాడు. దీంతో పోలీసులు అల‌ర్ట్ అయి ఆ యువ‌కుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement