Thursday, May 2, 2024

GVL: సీఎం కేసీఆర్‌కి భయం.. ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు పక్కా!

రెండేళ్ల నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌కి భయం పట్టుకుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీకి 400 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జనసేనతో కలిసే పని చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ, జనసేన ప్రత్యామ్నాయం అవుతాయన్న ఉద్దేశంతో కొంతమంది పాత తరహా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. కాపు రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధించిన అంశమన్నారు. కేంద్రానికి రిజర్వేషన్ల అంశానికి ఎటువంటి సంబంధం లేదని జీవీఎల్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement