Monday, April 29, 2024

ఖుష్బూ దోసెలు అదుర్స్!

తమిళనాడులో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అభ్యర్థులంతా ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓటర్లును ఆకర్షించేందుకు అభ్యర్థులు, నేతలు నానా తంటాలు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులు మాత్రమే గడువు ఉండటంతో అన్నిపార్టీల నేతలు జోరు పెంచారు. ఇక సినీ నటులు సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం థౌజండ్ లైట్స్ అసెంబ్లీ పరిధిలో ప్రచారం చేసిన ఆమె.. రోడ్డుపై ఓ టిఫిన్ సెంటర్‌లో దోసెలు వేశారు.

ఇక, కోయంబత్తూర్​ అసెంబ్లీ నియోజక వర్గానికి భాజపా నుంచి పోటీ చేసిన వనతి శ్రీనివాసన్​ తరఫున కేంద్ర మంత్రి, భాజపా నేత స్మృతి ఇరానీ ప్రచారంలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి దాండియా నృత్యం చేశారు. కాగా, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతల విన్యాసాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రచారంలో భాగంగా కొందరు అభ్యర్థులు దోశలు వేయడం, ఇస్త్రీ చేయడం, కూరగాయలు అమ్మడం, పెద్దల కాళ్లు కడగడం వంటి చేస్తున్నారు. మరికొందరెమో బట్టలు ఉతకడం దగ్గరి నుంచి పిల్లలకు స్నానాలు కూడా చేయిస్తున్నారు.

https://youtu.be/6XkHsqp2Ut0
Advertisement

తాజా వార్తలు

Advertisement