Tuesday, March 26, 2024

ఎపి సిఎం స‌ల‌హాదారు ప‌ద‌వికి నీలం రాజీనామా…

అమ‌రావ‌తి – మాజీ ఐఎఎస్ నీలం సాహ్ని ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న సిఎం స‌ల‌హాదారు ప‌ద‌వికి రాజీనామా చేశారు.. ఆమె రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా నియ‌మితులైన నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు..ఈ నెల 31వ తేదిన రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.. ఆయ‌న స్థానంలో నీలం సాహ్ని ఏప్రిల్ ఒక‌టో తేదిన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు.. కాగా స‌ల‌హాదారు ప‌ద‌వికి రాజీనామా చేసిన అనంత‌రం ఆమె ముఖ్య‌మంత్రిని క‌లిశారు..ఈ సంద‌ర్భంగా ఎస్ఈసీగా నియమితురాలైన నీలం సాహ్నీకి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పదవిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement