Sunday, May 5, 2024

మ‌హాత్మాగాంధీ విగ్ర‌హానికి నివాళులర్పించిన – జేపీ న‌డ్డా

తాను మ‌హాత్మాగాంధీ విగ్ర‌హం వ‌ద్ద‌కు వెళ్ళి తీర‌తాన‌ని స్ప‌ష్టం చేశారు బిజెపి జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా. ఈ మేరకు ఆయన గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి మౌన దీక్ష‌లు చేస్తోంది. ప్రజాస్వామ్య హక్కులను హరించలేరని నడ్డా తెలిపారు. బెంగాల్ తరహా అరాచకపాలనని టిఆర్ ఎస్ సాగిస్తుందని బిజెపి ఆరోపించింది. ఈ మేరకు నాయకులను చంపుతారా అని బిజెపి మహిళా నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా.. నేడు బీజేపీ పార్టీ సికింద్రాబాద్ లో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపింది. హైదరాబాద్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement