Sunday, May 5, 2024

కోటీశ్వ‌రురాలి ఆవేద‌న – బ్రెడ్ ముక్క అయినా ఇవ్వండి

బిలియ‌నీర్ అయినా తిన‌డానికి తిండే లేద‌ని వాపోయింది క్యాథీ షెన్.. చైనాలోని షౌంఘై నగరానికి చెందిన బిలియనీర్ క్యాథీ షెన్ .. ప్ర‌స్తుతం తన తన పరిస్థితిని వివరిస్తూ… సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తమకు కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ… తినేందుకు తిండే దొరకట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి ..పెద్ద వాళ్ల వరకు ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారని వివరించింది. ఎవరైనా సాయం చేసి తమ ఆకలి తీర్చాలని కోరింది. అంతే కాదు.. తినేందుకు బ్రెడ్ ముక్క‌ ఇచ్చినా చాలని వేడుకుంటోంది. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కోటీశ్వరుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పేద ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందోనంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ విధించిన ప్రభుత్వమే ప్రజలందరికీ ఆహారం పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరనే.. కరోనా తగ్గిపోయింది అనుకునే సమయంలో తన రూపం మార్చుకుంటూ.. కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలను చంపేస్తోందంటున్నారు. ఈ కోరనా మహమ్మారి పూర్తిగా ప్రపంచాన్ని వదిలి పోతేనే.. మనం ప్రశాంతంగా జీవించగలమని అంటున్నారు. అయితే వైరాలజీ నిపుణులు మాత్రం కొవిడ్ ఇప్పట్లో పోదని అంటున్నారు. డెంగ్యూ మలేరియా లాంటి ఇతర వైరస్ జ్వరాల లాగే కరోనా కూడా ఉండిపోతుందని చెబుతున్నారు. కొవిడ్ మహమ్మారితో ఎల్ల కాలం సహజీవనం చేయాల్సిందేనని చాలా మంది వైరాలజీ నిపుణులు నొక్కి చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement