Saturday, May 18, 2024

శ్రీలంక‌కు భారీ టార్గేట్.. లంక బౌల‌ర్ల‌ను చిత్తు చేసిన భార‌త్ బ్యాట‌ర్లు..

శ్రీలంక‌కు భారీ టార్గెట్.. లంక బౌల‌ర్ల‌ను చితక్కొట్టిన టీమిండియా..

శ్రీలంకతో లక్నోలో జ‌రుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యర్ దంచి కొట్టడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు.

కిషన్ ఉన్నంతసేపు యావ‌రేజ్ బ్యాటింగ్ చేసిన శ్రేయాస్.. కిషన్ అవుటయ్యాక లంక బౌలర్లపై చిచ్చర పిడుగులా విరుచుకుపడ్డాడు. 28 బంతుల్లో 57 (5 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు చేసి అజేయంగా నిలిచాడు అయ్య‌ర్. అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ 32 బంతుల్లో 44 పరుగులు చేసి లహిరు కుమార బౌలింగ్ లో అవుటయ్యాడు.

కాగా, శ్రీలంక బ్యాటింగ్​లో 5.4 ఓవర్లలోనే మూడు వికెట్లు టపా టపా కూల్చేశారు ఇండియన్​ బౌలర్లు. 29 పరుగులకే నిస్సాంక (1/0), కె. మిశ్రా(13/12), జే.లియానాగే(8/9) అవుటయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement