Saturday, May 4, 2024

గ్యాస్ వినియోగ‌దారుల‌కు భారీ షాక్.. రేట్ల పెంపుపై జనవరి 1న కేంద్రం కీలక నిర్ణయం..

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన ఎల్‌పీజీ సిలిండర్ (LPG Cylinder) రేట్లు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గతంలో ప్రజలకు రూ.500 లోపు ఉండే సిలిండర్ ధర ఇప్పుడు దాదాపుగా రూ.1000 అయ్యింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కొత్త సంవత్సరం (New Year)లో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) భారీ షాక్ ఇవ్వనున్న‌ట్టు స‌మాచారం. దేశంలో ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలపై కొన్ని మార్పులు, కొత్త నియమాలు జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభం రోజున (1 జనవరి 2022) కూడా కొన్ని మార్పులు ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఎల్‌పీజీ సిలిండర్ ధర (LPG Cylinder Price)పై ప్రతి నెలా ఒకటో తేదీన అధికారులు సమీక్ష‌ నిర్వహిస్తారు. ఈ క్రమంలో 2022 జనవరి 1న జరగనున్న సమావేశంలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం అని సమాచారం. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ ధరలను మోడీ ప్రభుత్వం చౌకగా మారుస్తుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒకటో తేదీన అసలు విషయం తేలనుంది. ఒకవేళ వంటగ్యాస్‌ ధరలు పెరిగితే మాత్రం సామాన్యులపై మరింత భారం పడక తప్పదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement